telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఒరేయ్ బామ్మర్ది’ అంటున్న సిద్ధార్థ్

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’, ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ వంటి హిట్ సినిమాలతో హీరో సిద్ధార్థ్ తెలుగులో మంచి ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. అయితే, ఆ తరవాత వరుసపెట్టి డిజాస్టర్లు రావడంతో సిద్ధార్థ్ తెలుగులో అవకాశాలు తగ్గాయి. ఆయన చివరిగా డబ్బింగ్ మూవీ ‘గృహం’తో తెలుగు ప్రేక్షకుల‌ ముందుకు వచ్చారు.  శర్వానంద్ హీరోగా RX 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మహాసముద్రం’ సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా తమిళ చిత్రం ‘శివప్పు మంజల్ పచ్చై’ తెలుగులో విడుదల కాబోతోంది. సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘బిచ్చగాడు’ ఫేమ్ ‘శశి’ డైరెక్ట్ చేశాడు. కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్ హీరోయిన్లు గా నటించారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్ పోటాపోటీగా నటించారని, వీరి కాంబినేషన్ లో వచ్చే యాక్షన్ సీన్స్ మూవీకి హైలైట్ గా నిలుస్తాయని నిర్మాత రమేష్ పి పిళ్ళై తెలిపారు. ఇప్పటికే తమిళంలో విడుదలై విజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో ‘ఒరేయ్ బామ్మర్ది’ పేరుతో డబ్ చేశారు. తాజాగా ఈ మూవీ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 

Related posts