telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బికినీలో బీచ్‌లో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు

దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. ఇక ఇప్పటికే రూహీ అఫ్జానాతో పాటు దోస్తానా 2 లో జాన్వీ కపూర్‌ నటించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. అయితే…అటు సినిమాలు చేస్తూ… ఇటు అందాలు ఆరబోస్తూ యువత మనుసులు దోచుకుంటుంది. అయితే… తాజాగా యు.ఎస్.లో ఉన్న చెల్లి ఖుషీ దగ్గరకు వెళ్ళి వచ్చిన జాన్వీ కపూర్ పనిలో పనిగా మాల్దీవ్స్ కు వెళ్ళింది. నిజానికి ఇటీవల బాలీవుడ్ సెలబ్రిటీస్ కు ఇది హాలిడే స్పాట్ గా మారిపోయింది. తన స్నేహితులతో కలిసి మాల్దీవ్స్ లో జల్సా చేసిన జాన్వీ కపూర్… ఇవాళ ఉదయం ఒకసారి సరదాగా సాయంత్రం మరోసారి అక్కడ దిగిన గ్లామర్ స్టిల్స్ ను పోస్ట్ చేసింది. రంగల బుడగలు అనే కాప్షన్ తో జాన్వీ కపూర్ పోస్ట్ చేసిన ఆ ఫోటోలను చూసే… జాన్వీనే ఆ రంగుల ఇంద్రధనస్సు అనేది అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ ఫోటోలు తెగ వైరల్‌ అవుతున్నాయి.  

Related posts