పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం విదేశాల్లో జరుగుతోంది. అయితే ఈ మధ్య టాలీవుడ్లోని భారీ సినిమాలకు సైతం లీకుల బెడద తప్పడంలేదు. స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ చేస్తున్న ‘పుష్ప’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్సాబ్’, జక్కన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఈ లీకుల బారిన పడ్డాయి. లీకుల నుంచి తప్పించుకునేందుకు ఈ సినిమాల నిర్మాతలు తెగ కష్టపడుతున్నారు. అయితే తాజాగా సర్కారు వారి పాట సినిమా నుంచి కూడా కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ఓ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన ఆన్ లొకేషన్ ఫోటోలను లీక్ చేశారు. అయితే ఇప్పుడు సర్కారు వారు ఈ లీకుల బెడదను ఎలా ఎదుర్కుంటారనేది చూడాలి.
లాక్ డౌన్ పై కీలక వ్యాఖ్యలు చేసిన మోడీ…