టాలీవుడ్ లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం చెందారు. ఆయన స్వగ్రామం నుంచి హైదరాబాద్కు శుక్రవారం వస్తుండగా.. కోదాడ సమీపంలో ఫిట్స్ వచ్చాయి. దీంతో ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచారు. నాగేశ్వర రావుకి కుమారుడు, కూతురు భార్య ఉన్నారు.
ఈ విషయాన్ని ఆయన కుమారుడు చెప్పడంతో .. మరో డైరెక్టర్ వీరశంకర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన స్నేహితుడు ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నాగేశ్వరరావు తొలిచిత్రం కృష్ణంరాజు, జయసుధ నటించిన ‘రిక్షా రుద్రయ్య’తో టాలీవుడ్లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆయన రియల్ స్టార్ శ్రీహరిని ‘పోలీస్’ సినిమాతో హీరోగా పరిచయం చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని దక్కించుకుంది. తర్వాత సాంబయ్య, శ్రైశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి చిత్రాలు తీశారు నాగేశ్వరరావు.
హీరోయిన్ సాయిపల్లవిపై కేసు నమోదు..