telugu navyamedia
సినిమా వార్తలు

“సరిలేరు నీకెవ్వరు” నుంచి జగపతి బాబు తప్పుకోవడం కారణం ఇదే…?

Sarileru-Nikevvaru

“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూప‌ర్‌స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వ‌రు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంక‌ర‌, దిల్‌రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియ‌ర్ న‌టి విజ‌య‌శాంతి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్‌లో ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈయ‌న మ‌హేష్ స‌రిలేరు నీకెవ్వ‌రు నుంచి బ‌య‌టికి రావ‌డంతో కొంద‌రేమో అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి జ‌గ‌ప‌తిబాబును తీసేశారని అంటుంటే… మ‌రికొంద‌రు మాత్రం జ‌గ్గూ భాయ్ బ‌య‌టికి వ‌చ్చేసాడంటున్నారు. మ‌హేష్ బాబుతో ఈయ‌న‌కు శ్రీమంతుడు, మహర్షి సినిమాల అనుబంధం ఉంది. జ‌గ‌ప‌తిబాబు ఈ సినిమా నుంచి బ‌య‌టికి రావ‌డానికి కార‌ణం ముందు ఆయ‌న‌కు చెప్పిన క‌థ‌.. ఆ త‌ర్వాత షూటింగ్‌కు వెళ్లిన తర్వాత కనిపించిన కథ మరోలా ఉండటమే అని తెలుస్తుంది. అది ప్ర‌శ్నించినందుకే ఈ సినిమా ఆయ‌న చేజారింద‌ని తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తీరుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూనే ఈ చిత్రం నుంచి జ‌గ్గూ భాయ్ వాకౌట్ చేసాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు ద‌ర్శ‌క నిర్మాత‌లు క్లారిటీ ఇవ్వ‌లేదు. ఇక “సరిలేరు నీకెవ్వరు” కోస‌మే ఓ తమిళ, కన్నడ సినిమాను జగపతిబాబు వ‌దులుకున్నాడ‌ని ప్ర‌చారం జరుగుతోంది. ఇప్పుడు జ‌గ‌ప‌తిబాబు స్థానంలో ప్ర‌కాశ్ రాజ్‌ను తీసుకుంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు.

Related posts