telugu navyamedia
సామాజిక

వెంకన్న దర్శనానికి రికార్డుస్థాయిలో పోటీ..

తిరుమల శ్రీవారి సర్వదర్శన టిక్కెట్లు నిమిషాల్లో కనుమరుగయ్యాయి. కోవిడ్ పరిస్థితులు కుదుట పడినతర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శన విధానంలో టిక్కెట్లను విడుదల చేసింది.

డిసెంబరు నెలకు సంబంధించిన 3 లక్షల 10 వేల టిక్కెట్లను 16 నిమిషాల్లోనే భక్తులు నమోదు చేసుకున్నారు. దేవ స్థానం అధికారులు ముందస్తుగానే ప్రకటించి… టిక్కెట్లను విడుదలచేయడంతో రికార్డు స్థాయిలో బుక్కయ్యాయి.

కేవలం 16 నిమిషాల వ్యవధిలో 3.10లక్షల టికెట్లు ఆన్ లైన్ లో రిలయన్స్ సంస్థ జియో మార్ట్ క్లౌడ్ విధానం ద్వారా పొందారని సమాచారం. గత నెలలో 2లక్షల 40 వేల టికెట్లను 19 నిమిషాల్లో పొందిన భక్తులు.. కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే 3 లక్షల 10 వేల టిక్కెట్లను సొంతం చేసుకున్నారు.

Related posts