తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నా నేపథ్యంలో సోషల్ మీడియాలో కూతురు అమృతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తండ్రిపై ప్రేమ లేకున్నా, కన్న తల్లిపై కనికరం ఉన్నా, ఈ పాటికి ఆమె ఇంటికి వెళ్లి, తల్లికి తోడుగా ఉండేదని కామెంట్లు వస్తున్నాయి. వీటిపై అమృత స్పందించారు. ఈ రోజు ఈ ఉదయం తనను కలిసిన మీడియాతో ఆమె మాట్లాడారు. తనకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడని వారు, ఇప్పుడు చేసే వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మండిపడింది.
ఎప్పుడైతే తన భర్తను హత్య చేయించారో, ఆ క్షణం నుంచి తనకు ఆయనపై ఆప్యాయత చచ్చిపోయిందని, ఇప్పుడు తనలో ఎటువంటి భావోద్వేగాలూ కలగడం లేదని వెల్లడించింది. తన తండ్రి ఇంట్లో ఆస్తి వ్యవహారాల్లో విభేదాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలుసునని, వాటివల్లే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, అల్లుడిని చంపించానన్న పశ్చాత్తాపం కూడా వెంటాడి వుంటుందని పేర్కొంది. తనకు తండ్రిని చివరి సారిగా చూడాలని మాత్రం ఉందని, అందుకు పరిస్థితులు అంగీకరిస్తే, వెళ్లి వస్తానని తెలిపింది.
ఉద్యోగ సంఘాలకు మాట్లాడే పరిస్థితి లేదు: జీవన్రెడ్డి