హైదరాబాద్ వరదలపై టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ వేసిన సెటైర్ రివర్స్ అయింది. చివరికి బ్రహ్మాజీ ట్విట్టర్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కొన్ని రోజుల క్రితం బ్రహ్మాజీ హైదరాబాద్ వరదలపై సెటైర్ వేసాడు. “ఓ మోటార్ బోటు కొనాలని అనుకుంటున్నాను. దయచేసి ఓ మంచి బోటు గురించి చెప్పండి ప్లీజ్” అని ట్వీట్ చేసాడు బ్రహ్మాజీ. అలాగే తన ఇంటి చుట్టూ ఉన్న వరద నీరు ఫోటోలను పోస్ట్ చేసాడు బ్రహ్మాజీ. దీనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. కొందరు ఆయనకు సూచనలు చేస్తుంటే..మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ట్వీట్ వైరల్ కావడంతో బ్రహ్మాజీపై ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఈ ట్రోలింగ్ దెబ్బకు ట్విట్టర్ ఖాతాని బ్రహ్మాజీ తొలగించుకున్నాడు. నెటిజన్ల ఆగ్రహానికి ఖాతాని డిలీట్ చేసుకున్నాడు. కాగా..హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వదలడం లేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో హైదరాబాద్ వాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ వర్షాలతో 30 మందికి పైగా మరణించారు. అయితే హైదరాబాద్ వరదలపై సోషల్ మీడియాలో నెటిజన్లు రోజుకో సెటైర్ వేస్తున్నారు.
previous post