telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఎఫ్‌-2 కు అరుదైన గౌరవం…

F2

వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలు గా నటించిన ఎఫ్ 2 తెలుగులో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. సినిమాలో వారిద్దరి కామెడీ టైమింగ్ ప్రజలను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమాకు దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ హీరోయిన్ లు గ నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు అద్భుతమైన గౌరవం దక్కింది. 2019 ఇండియన్‌ పనోరమ విభాగంలో ఎఫ్‌-2 సినిమాకు అవార్డు దక్కింది. అయితే 2019 ఇండియన్‌ పనోరమలో ఎంపికైన ఏకైక తెలుగు సినిమా ఎఫ్‌-2 కావడం విశేషం. అయితే ఎఫ్ 2 సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 తీయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది . ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి ఆ సినిమా కి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాడు. అయితే ఈ సినిమాలో మరో హీరో కూడా ఉన్నాడని.. ఆ స్థానంలో చాల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఈ విషయం పై దర్శకుడు అనిల్ స్పందించాడు. ఈ సినిమాలో మూడో హీరో ఉంటాడో లేదో స్క్రిప్ట్ పూర్తిగా రాసిన తరువాత తెలుస్తుంది. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది మాత్రం క్లారిటీ లేదు.

Related posts