తెలంగాణలో ఉన్న ధరిద్రమైన ప్రతిపక్షాలు దేశంలో మరెక్కడా లేవని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీజేపీ దొంగలు ప్రజారోగ్యంపై డ్రామాలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నాయకులు ఢిల్లీలో ఒక డ్రామా హైదరాబాద్ మరో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు వచ్చినంత మాత్రానా హంగామా చేస్తారా అని నిలదీశారు. ఆసుపత్రి భవనాలు కూలితే బాధ్యలు ఎవరు? అని ప్రశ్నించారు.
ప్రజల ప్రాణాలు దృష్టిలో పెట్టుకుని ఉస్మానియా ఆసుపత్రి కేసును హైకోర్టు సూమోటాగా తీసుకుని, పరిష్కరించాలని కోరారు.పేదల కోసం 27ఎకరాల్లో ఉస్మానియాను పునర్మిస్తామంటే ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లాయని తప్పుబట్టారు. హెరిటేజ్ భవనం అయితే ఉస్మానియాను బాగుచేయకూడదా? అని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రణాళిక ఉందని తెలిపారు.