‘అరణ్య’ మూవీ రిలీజ్ తేదీ నిరీక్షణ ముగిసింది. 2021 సంక్రాంతికి అరణ్య చిత్రం రిలీజ్ అవుతోందని దగ్గుబాటి రానా స్వయంగా వెల్లడించాడు. హిందీలో హాథీ మేరీ సాథీగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలవనున్నది. ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తుండగా.. రానా, విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ ప్రధాన పాత్రధారులు పోషిస్తున్నారు. ఈ చిత్రం పర్యావరణ ఇతివృత్తంతో రూపొందినట్టు తెలుస్తోంది. 25 సంవత్సరాలుగా అరణ్యంలో జీవిస్తున్న ఒక మనిషి కథ ‘అరణ్య’. ఈ చిత్రం పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెడుతోంది. మానవుల స్వార్థం కోసం అడవుల ఆక్రమణ, సహజ వనరులను నాశనం చేయడం వలన అడవి జంతువుల మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. మనిషి స్వార్ధం వల్ల ఏనుగులు మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే దానిని ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథగా అరణ్య తెరకెక్కింది. ఇందులో రానా పాత్రకు సంబంధించిన లుక్ చాలా డిఫరెంట్ గా ఉండడంతో చిత్రంపై మొదటి నుంచి అభిమానుల్లో ఆసక్తి కలుగుతోంది. మొత్తానికి వచ్చే సంక్రాంతి బరిలో రానా ఓ సందేశాత్మక చిత్రంతో రానున్నాడు. కాగా, సంక్రాంతికి పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కూడా విడుదల కానున్నట్టు తెలుస్తోంది.
previous post
next post
బిగ్ బాస్-3 : వరుణ్ అంటే ఎవరికీ ఇష్టం ఉండేది కాదు… పునర్నవి వ్యాఖ్యలు