“మహర్షి”తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న 26వ చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనీల్ సుంకర, దిల్రాజు, మహేష్ నిర్మిస్తున్నారు. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్లో ప్రారంభమయ్యింది. ఇప్పుడు ఈయన మహేష్ సరిలేరు నీకెవ్వరు నుంచి బయటికి రావడంతో కొందరేమో అనిల్ రావిపూడి ఈ చిత్రం నుంచి జగపతిబాబును తీసేశారని అంటుంటే… మరికొందరు మాత్రం జగ్గూ భాయ్ బయటికి వచ్చేసాడంటున్నారు. మహేష్ బాబుతో ఈయనకు శ్రీమంతుడు, మహర్షి సినిమాల అనుబంధం ఉంది. ఇలాంటి తరుణంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి దీనిపై వివరణ ఇచ్చారు. అలాగే ఇప్పుడు జగపతిబాబు కూడా వివరణ ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు.
“సినిమా ఇండస్ట్రీ నా ఫ్యామిలీ లాంటిది. నా ఫ్యామిలీ గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు. ఓ క్లారిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది. 33 ఏళ్లలో ఇలాంటి క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్ టైమ్ ఇస్తున్నాను. మహేశ్, అనిల్రావిపూడి సినిమాలో నుండి నేను తప్పుకున్నాను అని రకరకాల పుకార్లు వస్తున్నాయి. ఆ వార్తల్లో నిజం లేదు. ఇప్పటికీ ఆ క్యారెక్టర్ నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. ఇప్పటికీ చేయమంటే రెడీగా ఉన్నాను. ఆ సినిమా కోసం రెండు సినిమాలు వదులుకుందన్నమాట కూడా నిజం. కానీ కొన్ని పరిస్థితుల్లో ఇండస్ట్రీలో కొన్ని కొన్ని జరుగుతుంటాయి. అలాంటి తప్పవు. అలాంటి పరిస్థితుల వల్ల ఆ సినిమాలో నేను లేను. ఎంటైర్ యూనిట్కు ఆల్ ది బెస్ట్” అన్నారు జగపతిబాబు.