మెగాస్టార్ చిరంజీవి కోడలు, హీరో రామ్చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల పుట్టినరోజు జులై 20. పుట్టినరోజు సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్ భార్యగా, మెగా కోడలిగా, అపోలో ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్గా ఆమె కీలక బాధ్యతలు చేపట్టింది. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పట్ల తన వంతు బాధ్యతగా స్పందిస్తూ ఉంటుంది. ఈ సందర్భంగా భర్త రామ్ చరణ్ … ఉపాసనపై ట్వీట్ చేశారు. రామ్ చరణ్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె ఫొటోను పోస్ట్ చేశాడు. ‘ఇతరులపై చాలా దయ చూపుతూ నువ్వు చేసే పనులు ఎంత చిన్నవైనా సరే అవి ఎన్నటికీ వృథాకావు. నీ మంచి పనుల్ని ఇలాగే కొనసాగిస్తూ వెళతావని ఆశిస్తున్నాను.. గుర్తింపు దానికదే వస్తుంది. హ్యాపీ బర్త్ డే’ అని రామ్ చరణ్ తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఇక పుట్టినరోజు సందర్భంగా ఆమె ఓ మంచి పని చేశారు. అదేంటంటే దత్తత స్వీకరించారు. అయితే దత్తత తీసుకుంది పిల్లాడినో, పిల్లనో కాదు.. ఓ ఎనుగుని దత్తత తీసుకున్నారు ఉపాసన. పుట్టినరోజు సందర్భంగా నెహ్రూ జూపార్కును సందర్శించిన ఉపాసన రాణి అనే ఎనుగును ఏడాది కాలానికి దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా రాణి పోషణకు అయ్యే ఖర్చు రూ.5 లక్షలను ఐఎఫ్యస్ అధికారి క్షితిజకు అందించారు. ఉపాసన సేవా దృక్పధాన్నిక్యూరేటర్, ఐఎఫ్యస్ అధికారి క్షితిజ ప్రశంసించారు. ఉపాసన సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుందన్న విషయం తెలిసిందే.
previous post