అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఇండియానాపొలిస్లోని ఓ ఇంట్లో ఆదివారం అర్ధరాత్రి దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ కాల్పుల్లో గర్భిణి సహా ఐదుగురు మృతి చెందారు. కాల్పుల్లో గాయపడ్డ మరో చిన్నారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు జరిగినట్లు ఇండియానాపొలిస్ పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగులో గాయాలతో పడి ఉన్న ఓ బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ బాలుడు బతికే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటన యాదృచ్ఛికంగా జరగలేదని.. సామూహిక హత్య అని పోలీసులు అభిప్రాయపడ్డారు. అసలు ఈ కాల్పులు ఎవరు జరిపారు.. అసలెందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
previous post
next post
“టాలీవుడ్లో మరో వికెట్ పడింది…” నిఖిల్ పెళ్ళిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్స్