telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కొనసాగుతున్న ఏపీ బంద్‌.. పాల్గొన్న ఎంపీ విజయసాయి

విశాఖ ఉక్కు ఉద్యమ సెగలు ఢిల్లీకి తాకేలా కార్మికులు కార్యాచరణ రూపొందించారు. స్టీల్ ప్లాంట్ స్ట్రాటజిక్ సేల్‌కు వ్యతిరేకంగా… దశల వారీగా ఆందోళన చేపట్టనుంది. ఇవాళ రాష్ట్రబంద్ నిర్వహిస్తున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జేఏసీ చేపట్టిన బంద్‌ను విజయవంతం చేసేందుకు అన్నివర్గాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోకి కార్మికులు రోడ్డెక్కారు. ఉద్యోగ సంఘాలు ఉక్కు పోరాటానికి సంఘీభావం ప్రకటించాయి. అత్యవసర రవాణా సేవలు మినహా అన్నీ బంద్ పరిధిలోకి రానున్నాయి. స్కూళ్ళు, కాలేజీలు, విద్యా సంస్ధలు మూతపడ్డాయి. అన్ని పార్టీల నేతలు రోడ్డెక్కి.. తమ నిరసన తెలియజేస్తున్నారు. విశాఖలో వామపక్ష నేతల ఆందోళనకు.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మద్దతు తెలిపారు. విశాఖ ఉక్కును కాపాడుకునేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts