హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ కు త్రుటిలో ప్రమాదం తప్పింది. నల్లగొండలో తనకు జరిగే పౌర సన్మానం కార్యక్రమం లో పాల్గొనేందుకు హైదరాబాద్ నుండి నల్లగొండ కు వెళ్తుండగా చౌటుప్పల్ మండలం ఖైతాపురం గ్రామ శివారులో జాతీయ రహదారిపై దత్తాత్రేయ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఆయన ప్రయాణిస్తున్న కారు స్టీరింగ్ బిగుసుకు పోవడంతో రోడ్డు పక్కకు దూసుకు పోయింది కారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడం తో భారీ ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు అవలేదు… కొద్దిసేపటి తర్వాత మరో వాహనంలో నల్లగొండకు బయల్దేరారు గవర్నర్ దత్తాత్రేయ. అయితే అంతకముందు యాదాద్రి పర్యటనలో భాగంగా వచ్చిన బండారు దత్తాత్రేయకి భువనగిరి పట్టణంలో ఘన స్వాగతం పలికారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, కార్యకర్తలు. కోవిడ్ మహమ్మారి వల్ల దేశ, రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని అతలాకుతలం చేసింది. నా రాజకీయ జీవితంలో గానీ, ప్రజా జీవితంలో గానీ నేను ఇంత నిర్బంధం లో లేను. ఈ కష్ట కాలంలో అందరూ ధైర్యంగా నిలబడాలి…కోవిడ్ నియమాలను అందరూ పాటించాలి. వ్యాక్సిన్ మన దేశం లో తయారవటం మన దేశానికి అభినందనీయం. హైదరాబాద్ ఔషద నగరి…ఇది ఇంకా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది అని తెలిపారు.
previous post
బీజేపీలో చేరనందుకే శివకుమార్ పై వేధింపులు: సిద్ధరామయ్య