telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్ణాటక ఎక్సైజ్ మంత్రి ప్రకటనపై సీఎం యడియూరప్ప ఫైర్

yadurappa karnataka

కర్ణాటక ఎక్సైజ్ మంత్రి హెచ్. నగేష్‌పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప మండిపడ్డారు. నేరుగా ఇంటికే మద్యం సరఫరా చేస్తామని మంత్రి ప్రకటన పై రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా మహిళలు ఈ ప్రకటనపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ  విషయం తెలుసుకున్న సీఎం యడియూరప్ప మంత్రిని పిలిచి వివరణ కోరారు. ఎవరిని అడిగి ఈ ప్రకటన చేశావని నిలదీశారు. ఇష్టమొచ్చినట్లు ప్రకటనలు చేస్తే చర్యలు తప్పవనీ సూచించారు.

ఇప్పటికే రాష్ట్ర ప్రజలంతా వరదలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఈ కొత్త సమస్య తీసుకొచ్చావని మండిపడ్డారు. ఈ క్రమంలో మంత్రి వివరణ ఇస్తూ ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు క్షమాపణలు చెప్పారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయనీ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి ప్రమాదాలు జరగకుండా చేసిన ఈ ప్రకటన వల్ల ఎవరైనా బాధకు గురైతే క్షమించాలని అన్నారు.

Related posts