బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రజలంతా ఆవేదన వ్యక్తం చేశారు. సుశాంత్ ఆత్మహత్యకు కారణం బాలీవుడ్లోని నెపోటిజమ్ కారణమంటూ బాలీవుడ్ సినీ ప్రముఖులపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఓ ఫొటోగ్రాఫర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సుశాంత్ సింగ్ అంతిమ యాత్రకు సంబంధించిన వీడియోను ఓ ప్రముఖ ఫొటోగ్రాఫర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. `నేను తీసిన ఫోటోలు లేదా వీడియోలను నా అనుమతి లేకుండా ఏ ప్లాట్ఫామ్లోనూ పోస్ట్ చేయరాదు` అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. దీనిపై దీపిక మండిపడింది. `అవునా.. ఇలా వీడియో తీయడం సరైన పనేనా? ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు సుశాంత్ కుటుంబ సభ్యుల అనుమతి తీసుకున్నారా? ఒక వ్యక్తి మృతిని కూడా క్యాష్ చేసుకుంటున్నారా?` అంటూ దీపిక ఆగ్రహం వ్యక్తం చేసింది.
previous post