మెగా బ్రదర్ నాగబాబు బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇక నాగబాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా నాగబాబు ఓటర్లపై మండిపడ్డారు. “కష్ట సమయంలో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు? 40 శాతం ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు. రాష్ట్రంలో అభివృద్ధి లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వం అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు’ అని నాగబాబు విమర్శలు గుప్పించారు.
రాష్ట్రం లో అభివృద్ది లేదు, కష్టం వస్తే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, అవినీతి లో కూరుకుపోయిన ప్రభుత్వం, అని నిందించే హక్కు రెండు వేలు తీసుకుని ఓటు వేసిన నీకు లేదు….
— Naga Babu Konidela (@NagaBabuOffl) August 9, 2020
కష్ట సమయం లో నాయకులు దాక్కున్నారు అంటున్నావ్, ఓటు వేసేటప్పుడు వెయ్యకుండా నువ్వెక్కడ దాక్కున్నావు?
40% ఓటు వేయని జనానికి ప్రశ్నించే హక్కు లేదు..— Naga Babu Konidela (@NagaBabuOffl) August 10, 2020