telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జియో టీవీ ప్లస్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ?

Mahesh

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో డిజిటల్ రంగానికి డిమాండ్ భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ జియో టీవీ ప్లస్ ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. జియో టీవీ ప్లస్‌లో 12 ఓటీటీ కార్యక్రమాలు ఉంటాయని, ప్రధాన ఛానల్స్ అన్నీ జియో టీవీ ప్లస్‌లో చేర్చామని రిలయన్స్ తెలిపింది. జియో ఫైబర్ ద్వారా టీవీ ప్రసారాల్లో కొత్త ఒరవడి తీసుకు వచ్చామని తెలిపింది. ఒక్క లాగిన్ తో శాటిలైట్ ఛానల్స్ మరియు ఓటీటీ కంటెంట్ చూసే వీలును జియో కల్పించబోతుంది. నార్త్ లో ప్రముఖ బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ తో జియో టీవీ ప్లస్ కు ప్రచారం చేయించాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక సౌత్ మొత్తం కూడా ఒక్క హీరోతోనే చేయించాలనే ఉద్దేశ్యంతో అన్ని భాషల్లో గుర్తింపు ఉన్న మహేష్ బాబును సంప్రదించారట. ఏడాది పాటు జియో టీవీ ప్లస్ కు సౌత్ ఇండియా మొత్తం మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడని అంటున్నారు.

Related posts