telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన: బుద్ధా వెంకన్న

budda venkanna fire on ap govt

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఏడాదికాలంగా ఇనుప సంకెళ్ల పాలన నడుస్తోందని దుయ్యబట్టారు. మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు క్షమించరన్నారు. సోషల్ మీడియాలో సాక్ష్యాధారాలతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులపై అసభ్య పదజాలంతో పోస్టింగులు పెడుతున్న వారిని వదిలేస్తున్నారన్నారు.

రాష్ట్రాన్ని జగన్ పరిపాలిస్తున్నారో, రాక్షసులు పాలిస్తున్నారో అర్థంకావడం లేదని ఆయన దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదని స్పష్టం చేశారు. రాజధాని మార్చడమంటే రంగులు మార్చినంత ఈజీ కాదన్నారు. ఏడాది కాలంలో దాదాపు 1,500 మంది అమాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారని విమర్శించారు.

Related posts