telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగి వెళ్లేది లేదు: చంద్రబాబు

chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖపట్నం పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్ద తనను వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తనను ఎన్ కౌంటర్ చేసినా వెనుదిరిగి వెళ్లేది లేదని ఉద్ఘాటించారు. తాను ప్రజలతో మాట్లాడితే బండారం బయటపడుతుందని వైసీపీ నేతల ప్యాంట్లు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రశాంతమైన విశాఖ నగరాన్ని వైసీపీ నేతలు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేశా. ప్రతిపక్ష నాయకుడిగా ఇది పదకొండో సంవత్సరం. దేనికి నన్ను అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలి. కాగితంపై రాసి ఇవ్వండి. మీరు పోలీసులో కాదో ఎవరికి తెలుసు? నన్ను ఏ చట్టం కింద వెళ్లిపొమ్మని చెబుతున్నారు? అని ప్రశ్నించారు. నేను జనం కష్టాలు తెలుసుకోవడానికి వచ్చాను. కానీ వైసీపీ నేతలు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులిచ్చి మనుషుల్ని తీసుకువచ్చి మాపై కోడిగుడ్లు, రాళ్లు, చెప్పులు వేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related posts