telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అక్కడి స్కూళ్లకు ఆగస్టు వరకు సెలవులు!

Neyork children

కరోన దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడుతున్న నేపథ్యంలో కొన్ని దేశాల్లో స్కూళ్లకు సెలవులను పొడగిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో అతిపెద్ద మహా నగరంగా ఉన్న న్యూయార్క్ లో విద్యార్థులకు ఆగస్టు వరకూ సెలవులుంటాయని నగర మేయర్ బిల్ డీ బ్లాసియో తెలిపారు. సెప్టెంబర్ లో మాత్రమే పబ్లిక్ స్కూళ్లు తిరిగి తెరచుకునే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గని కారణంతోనే, విద్యా సంవత్సరం ముగిసేంత వరకూ స్కూళ్లు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని తామేమీ అంత సులభంగా తీసుకోలేదని, పరిస్థితులను సమీక్షించి, సెలవులను పొడగించామన్నారు. మెట్రోపాలిటన్ రీజియన్ లోని అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపిన తరువాతనే విద్యార్థులు, ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతోనే నిర్ణయం తీసుకున్నామని మీడియాకు ఆయన వెల్లడించారు.

ఇదిలావుండగా, మేయర్ కు పాఠశాలలను మూసివేసే అధికారాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు. మేయర్ తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోదముద్ర వేయాల్సి వుందని వెల్లడించారు. మేయర్ నిర్ణయాన్ని ఆయన తోసిపుచ్చే అధికారాన్ని కూడా కలిగివుంటారని న్యూయార్క్ యూనివర్శిటీ లా స్కూల్ ప్రొఫెసర్ రోడ్రిక్ హిల్స్ పేర్కొన్నారు. 

Related posts