telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బ్రేకింగ్‌ : అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు

achennayudu tdp

ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు అయింది. అచ్చెన్నాయుడికి సోంపేట కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 50 వేల పూచీకత్తుతో అచ్చెన్నాయుడికి బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు. అచ్చెన్నాయుడితో పాటు మరో 21 మంది రేపు రిలీజ్‌ కానున్నారు. కాగా.. శ్రీకాకుళం జిల్లాలోని నిమ్మాడలో తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని పోలీసులు ఈనెల 2న ఉదయం అరెస్ట్ చేశారు. సర్పంచ్‌ అభ్యర్థిని బెదిరించినట్లు అచ్చెన్నాయుడిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అచ్చెన్నాయుడు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆయనను అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత ఆయన్ను వైద్యపరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తరువాత కోర్టుకు తీసుకెళ్లారు. అయితే. అచ్చెన్నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. దీంతో.. ఆయనను అంపోలు జైలుకు తరలించారు. అయితే.. తాజాగా పూచీకత్తుతో ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది సోంపేట కోర్టు.

Related posts