telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ లో అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్…

ఈరోజు ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్లు ఢీ కొనబోతున్నాయి ఈ రెండు జట్లకూ ఈ సీజన్‌లో ఇది మూడో మ్యాచ్. ఓటమితో సీజన్ ఆరంభించిన ముంబై ఇండియన్స్.. ఆ తరువాతి మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. విజయాన్ని అందుకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడిన రెండింట్లోనూ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఏ మాత్రం రాణించగలిగినా.. మరో మైల్ స్టోన్‌ను అందుకుంటాడు. కేప్టెన్‌గా నాలుగు వేల పరుగుల క్లబ్‌లో చేరడానికి రోహిత్ శర్మ ఎంతో దూరంలో లేడు. ఇంకో 28 పరుగులు చేయగలిగితే చాలు. రోహిత్ శర్మ ఇప్పటిదాకా ఐపీఎల్‌లో సాధించిన పరుగులు 5,292. ఇదివరకు ముంబై ఇండియన్స్‌కు సచిన్ టెండుల్కర్ సారథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. అతని కేప్టెన్సీలో ఓపెనర్‌గా ఆడాడు రోహిత్ శర్మ. రోహిత్ కంటే ముందు ఈ రికార్డ్‌ను అందుకున్న వారిలో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కేప్టెన్‌గా ధోనీ 4,632 పరుగులు చేశాడు.

Related posts