తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. శాసనసభ్యుల కోటాలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్కుమార్ నామినేషన్ వేయడానికి ఎల్పీ ఆఫీసుకు వచ్చిన సందర్భంగా మాట్లాడుతూ.. ‘లోక్ సభ ఎన్నికల్లో మేము ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో మాకు సీట్లు పోయినా ఓటు శాతం పెరిగింది. గతం కంటే 6 శాతం ఓట్లు టీఆర్ఎస్కు పెరిగాయని తెలిపారు.
.మల్కాజ్గిరిలో కాంగ్రెస్పార్టీ స్వల్ప ఓట్లతో గెలుపొందింది. రేవంత్ రెడ్డిది ఒక గెలుపు కానే కాదు. లోక్సభ ఎన్నికల ఫలితాలు మాకు తాత్కాలిక స్పీడ్ బ్రేకర్లాంటివే. దేశ వ్యాప్తంగా మోదీ హవా ఉన్నప్పటికీ టీఆర్ఎస్ మంచి సీట్లను గెలుచుకుంది. ఆదిలాబాద్ ఎంపీ స్థానం బీజేపీ గెలుస్తుందని ఊహించలేదు. విచిత్రమైన ట్రెండ్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో కనిపించింది. అలాగే వరుస ఎన్నికలు, పాలనలో జాప్యం ప్రభావం ఉందేమో విశ్లేషిస్తామన్నారు.
తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్