నలభైయేళ్ల రాజకీయజీవితంలో చంద్రబాబునాయుడు ఏనాడూ ఎదుర్కోని అవమానాలు ఎదుర్కొని శాసనసభనుంచి నిష్క్రమించారు. ముఖ్యమంత్రి హోదాలోనే మళ్లీ శాసనసభలోకి అడుగుపెడతామన్న చంద్రబాబు శపథంచేసి వెళ్లిపోయారు.
తను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల్ని మీడియా ద్వారా ప్రజలతో పంచుకోడానికి నిర్వహించిన సమావేశంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కన్నీటి పర్యంతమయ్యారు. ఏడుపును దిగమింగుకోలేకపోయారు. వెక్కివెక్కి ఏడ్చేశారు. శాసనసభలో గౌరవం లేకుండా పోయిందని బాధపడ్డారు.
గడిచిన రెండున్నరేళ్లు సంవత్సరాలుగా..జగన్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని విధాలుగా అవమానిస్తున్నారని.. బండబూతులు కూడా తింటారని ఆయన వైసీపీపై ఆరోపణలు చేశారు.
నేను ఓడిపోయినప్పడు కూడా ఇంత బాధపడలేదు.. భార్యపై, కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు పరుష వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాజకీయంగా ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోలేదనీ, కానీ కుటుంబంపై ఇంత దారుణంగా విమర్శలు చేయడంతో సహించలేకపోతున్నానని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్