ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వంలోని నాలుగు రకాల శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం (నాన్ గెజిటెడ్) నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం..
అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు – 29 పోస్టులు
సమాచారశాఖలో అసిస్టెంట్ పబ్లిక్రి లేషన్ ఆఫీషర్ ఉద్యోగాలు -6
వైద్య ఆరోగ్య శాఖలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ – 1
బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో హాస్టల్ వార్డెన్ -గ్రేడ్ 2
ఉద్యోగాల భర్తికీ వచ్చే నెల నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు ఓప్రకటనలో తెలిపారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజులు వంటి వివరాల కోసం ఎపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చునని తెలిపారు.
ఇదిలాఉంటే.. ఏపీ పురావస్తు శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. ఉద్యోగానికి సెలక్ట్ అయిన విద్యార్థుల స్టడీ సర్టిఫికెట్ల వేరిఫికేషన్ ప్రక్రియ ఉంటుందని, దీనికి సంబంధించి తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.సీతా రామాంజనేయులు తెలిపారు.
వైఎస్ వివేకాను ఇంటి దొంగలే హత్య చేశారు: చంద్రబాబు