ఇకపై అన్ని కార్యక్రమాలు జనసేన- బిజెపి కలిసే చేస్తాయని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. ఈ నెల 28న విజయవాడలో కోఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. రాజధాని విషయంలో రైతులకు అండగా ఉండటానికి.. బిజెపి- జనసేన కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయని జనసేన నేత నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన తాడేపల్లి నుంచి విజయవాడ వరకు లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని, రాష్ట్ర ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడుతామని మనోహర్ తెలిపారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్తో జనసేన, బిజెపి బృందం భేటీ అయింది. ఈ భేటీలో బీజేపీ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, కన్నా లక్ష్మీనారాయణ, డియోధర, పురందేశ్వరిలు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదేండ్ల మనోహర్ పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించారు. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపైనా ఆర్థిక మంత్రితో మాట్లాడారు.