*తెలంగాణ మిల్లులో ధాన్యం నిల్వలు సరిగ్గాలేవు
*తెలంగాణ సీఎం మంత్రలు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు..
*రాజకీయ అజెండాతోనే కేంద్రంపై నిందలు వేస్తున్నారు
*ఎన్ని సార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు
రాజకీయ ఎజెండాతోనే కేంద్రంపై తెలంగాణ ప్రభుత్వం నిందలు వేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి రాజకీయాలే ముఖ్యమని, రాష్ట్ర సీఎం, మంత్రులు అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులపై టీఆర్ఎస్ నేతల విమర్శలు బాధాకరమన్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడితే ఒరిగేది లేదని, కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదన్నారు.ధాన్యం కొనుగోళ్లపై తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ధ్వజమెత్తారు.
తెలంగాణ సర్కార్ బాధ్యతారహిత్యంగా వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తీరుతోనే పేదలకు బియ్యం అందడం లేదని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తప్పులకు రైతులను బలి చేయడం సరి కాదని భావించి వెంటనే వడ్లు, బియ్యం సేకరణకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు. తక్షణం సేకరణ ప్రారంభించాలని ఎఫ్సీఐని ఆదేశించినట్లు వెల్లడించారు. ఈ మేరకు ధాన్యం సేకరణపై ఎఫ్సీఐ తెలంగాణకు క్లియరెన్స్ ఇస్తుందని పేర్కొన్నారు.
ఎన్నిసార్లు లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తెలంగాణ మిల్లుల్లో రైస్ స్టాక్ నిల్వలు సరిగా లేవని అన్నారు. మిల్లుల్లో అక్రమాలు జరిగాయని అందుకే ఈ చర్చ తీసుకున్నామని తెలిపారు.
తమ చర్చల వల్లే ఇప్పుడు బియ్యం సరఫరా చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి గరీబ్కల్యాణ్ అన్న యోజన కింద ఏప్రిల్, మే నెలలో ఉచిత బియ్యాన్ని ఇవ్వకుండా పేదలకు అన్యాయం చేశారన్నారు. అందుకే వల్ల గతంలో ఆంక్షలు విధించినట్లు చెప్పారు.
జూన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని మొదలుపెట్టడం, అక్రమాలకు పాల్పడిన మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆంక్షలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కొట్టిపారేసిన స్టాలిన్