ఆర్టీసీ ఆస్తులను 50 వేల కోట్లు తక్కువ చూపిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు.ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా శనివారం తన ఇంటి నుంచి ఆర్టీసీ డిపో వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుట్ర పూరితంగానే ఆర్టీసీ నష్టాల్లో ఉందని చెబుతున్నారని సీఎం కేసీఆర్పైమండిపడ్డారు.
రాజ్యాంగ బద్ధంగా ప్రమాణం చేసిన సీఎం కేసీఆర్ అసలు రాజ్యాంగబద్ధంగా పాలన చేస్తున్నారా అని ప్రశ్నించారు. సకల జనుల సమ్మెతో వచ్చిన తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు పెట్టుబడిదారులతో కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి 2లక్షల 50 వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నారన్నారు.