telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వ్యవసాయ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్‌ ఆమోదం

jagan

ఏపీ సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గవర్నర్‌ ప్రసంగానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2019–20 సప్లమెంటరీ బడ్జెట్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. 2020–2021 వ్యవసాయ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ యాక్ట్‌ –2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఆక్వాకల్చర్‌లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్‌ మరియు డెవలప్‌మెంట్‌ కోసం చట్టం రూపొందించారు.

Related posts