telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మండలికి ఎవరు తాగొచ్చారు.. యనమల వ్యాఖ్యలపై బొత్స ఫైర్

botsa ycp

శాసనమండలి సమావేశాలకు నిన్న కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీలు తాగి వచ్చారంటూ టీడీపీ ఎమ్మెల్సీ యనమల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ లాబీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ.. మండలికి ఎవరు తాగొచ్చారని బొత్స మండిపడ్డారు. యనమల చేసిన ఆరోపణలు సరికాదని అన్నారు.
అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను మండలిలో అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినట్టుగానే మండలి ఛైర్మన్ షరీఫ్ వ్యవహరించారని మండిపడ్డారు. సంఖ్యాబలం ఉందని మండలిలో టీడీపీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడిచారని దుయ్యబట్టారు. సూచనలు చేయాల్సిన మండలిలో బిల్లులను అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు.

Related posts