telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీ, జనసేనల పొత్తు వారి అంతర్గత వ్యవహారం: చంద్రబాబు

chandrababu

బీజేపీ, జనసేనల పొత్తు వారి అంతర్గత వ్యవహారమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాజకీయాలలో ఏ పార్టీ అయినా ఇంకో పార్టీతో కలిసి పని చేయవచ్చని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ ఆలోచనలన్నీ తప్పుడు మార్గంలో నడుస్తున్నాయని చంద్రబాబు విమర్శించారు.

మూడు రాజధానుల పేరుతో ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విశాఖను తాను ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. హైకోర్టును తరలించడం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదని చెప్పారు. అది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయమని పేర్కొన్నారు.

కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తాము చెప్పామని తెలిపారు. కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు. ఆ పని వారు చేస్తే తాము మద్దతిస్తామని చెప్పారు.కర్నూలు సమీంపలోని ఓర్వకల్లును తాము ఎంతో అభివృద్ధి చేశామని, ఎయిర్ పోర్టును కూడా నిర్మించామని పేర్కొన్నారు.

Related posts