telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు: లోకేశ్

Minister Lokesh comments YS Jagan

రాష్ట్రంలో సాగునీటి కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శించారు. వైసీపీ అమలు చేస్తామన్న ‘నవరత్నాలు’ అమలు చేస్తారో లేదో దేవుడికే తెలియాలని, అంతకన్నా ముందుగా నీటి కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారంటూ లోకేశ్ వరుస ట్వీట్లు చేశారు.

రికార్డు స్థాయిలో వరదలు వచ్చినా, నీటిని ఒడిసి పట్టుకోవాల్సిన ప్రభుత్వం, చంద్రబాబు ఇంటిని ముంచేందుకని ఆ నీటిని దిగువ ప్రాంతానికి వదిలేశారని ఘాటు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ప్రజల నీటి కష్టాలకు సంబంధించి ఆయా పత్రికల్లో వచ్చిన కథనాల ప్రతులను పోస్ట్ చేశారు. మంత్రి జయరాం మండలంలో కూడా సాగు, తాగునీటి సమస్యలు ఉన్నాయని స్వయంగా వైసీపీ సభ్యులే విమర్శలు చేస్తూ వచ్చిన ఓ కథనాన్ని జతపరిచారు.

Related posts