telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

పాకిస్థాన్‌లో పెళ్లి జరుగుతుండగా .. హిందూ వధువు అపహరణ!

పాకిస్థాన్‌లో పెళ్లి జరుగుతుండగా హిందూ వధువు అపహరణకు గురైంది. 24 ఏళ్ల వధువును అపహరించిన దుండగులు మతం మార్చి ముస్లిం యువకుడికి ఇచ్చి వివాహం జరిపించారు. సింధ్ ప్రావిన్స్‌లోని హలా పట్టణంలో గత వారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రావిన్స్ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి హరిరామ్ కిశోర్ అధికారుల నుంచి నివేదిక కోరారు. మరోవైపు, భారత ప్రభుత్వం కూడా ఈ విషయంపై దృష్టిసారించింది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌కు చెందిన సీనియర్ ఉద్యోగిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related posts