సూపర్స్టార్ రజనీకాంత్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. తాజాగా దర్బార్ సినిమా షూటింగ్ చేస్తున్నారు రజనీకాంత్. ఈ మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్లే ముందు తన ఇంటి వద్ద రజనీ మీడియాతో మాట్లాడారు. మీరు రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశ పెట్టుకున్నారు కదా? అని మీడియా ప్రశ్నించగా.. అభిమానులను నిరాశపరచను.
అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగితే అప్పుడు ఖచ్చితంగా పోటీ చేస్తాను అని రజనీకాంత్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తారా? అని మీడియా ఆయనను ప్రశ్నించగా.. మే 23న తెలుస్తుంది కదా అని చెప్పారు. తమిళనాడులోని 18 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఒక వేళ ఈ ఎన్నికల ఫలితాల అనంతరం అన్నాడీఎంకే మెజార్టీ తగ్గితే.. ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది.
నాకొడుకు ‘దొంగ నా కొడుకు!’… రవితేజ ఆసక్తికర పోస్ట్…