తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు గజ్వేల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్ మార్కెడ్ యార్డ్, ఐవోసీ, ఆడిటోరియాన్ని ప్రారంభిస్తారు. అలాగే, రూ.100 కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, రూ.32 కోట్లతో మాతా శిశు సంరక్షణ దవాఖాన పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం స్థానిక ఆడిటోరియంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో నియోజకవర్గ స్థాయి ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తారు.
కేసీఆర్ గజ్వేల్ నుంచి శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించడంతో అనేక అభివృద్ధి పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ యార్డు, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రజలకు అంకితం చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు.