telugu navyamedia
రాజకీయ వార్తలు

షీలా దీక్షిత్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసిన మోదీ

Modi wishes to Imran Pakistan

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు షీలా దీక్షిత్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ట్విటర్ లో స్పందించారు. షీలా జీ మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానంటూ మోదీ ట్వీట్ చేశారు. స్నేహపూర్వక వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకునేవారంటూ షీలా దీక్షిత్ గురించి పేర్కొన్నారు.

ఢిల్లీ అభివృద్ధిలో ఆమె ఎంతో విలువైన భాగస్వామ్యం అందించారని తెలిపారు. షీలా దీక్షిత్ కుటుంబానికి, ఆమె మద్దతుదారులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు తన ట్వీట్ లో పేర్కొన్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న షీలా దీక్షిత్ ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలోచికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె బాధ్యతలను నిర్వహించారు.

Related posts