కరోనా వైరస్ ఎవరినీ వదలడం లేదు. సాధారణ ప్రజలు అయినా సరే.. ప్రధాని అయినా సరే.. ప్రజాప్రతినిధి అయినా సరే.. అధికారి అయినా సరే దానికి మాత్రం ఏ మాత్రం వివక్షలేదు.. అదును దొరికితేచాలు ఎటాక్ చేస్తోంది.. ఇప్పటికే ఎంతోమంది ప్రజాప్రతినిధులు కరోనాబారిన పడ్డారు.. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కూడా టచ్ చేసింది కరోనా.. తాజాగా..కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా కరోనా బారినపడ్డారు.. గత రెండు రోజులుగా ఆయన స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా… పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఓ ప్రజా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..అనంతరం కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ముంబైలోని ఓ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని.. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందవద్దని సూచించిన కేంద్రమంత్రి రాందాస్ అథవాలే.. గత వారం రోజులుగా తనను కలిసిన వారంతా కరోనా టెస్ట్లు చేయించుకోవాల్సింది అని కోరారు.
previous post
తన మంత్రి పదవి ఎవరి బిక్ష కాదు..ఈటల సంచలన వ్యాఖ్యలు!