telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మాటల్లో తేనె.. చేతల్లో కత్తెర: యనమల

Yanamala tdp

వైసీపీ సర్కార్ పై టీడీపీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మరోసారి విరుచుకుపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం ఏపీలో ప్రవేశపెట్టిన పథకానికే పేరు మార్చి జగనన్న వసతి దీవెన పేరుతో మళ్లీ కొత్తగా ప్రవేశపెట్టారని ఆయన చెప్పారు. మాటల్లో తేనె ఉంటుందని, చేతల్లో కత్తెర ఉంటుందని విమర్శలు గుప్పించారు. ఇది జగన్మాయే తప్ప కొత్త పథకం కాదని విమర్శలు గుప్పించారు.

తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులను జగన్‌ తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కంటి వెలుగు పథకం కూడా టీడీపీ తెచ్చిన పథకమేనని చెప్పారు. రాష్ట్రానికి వైసీపీ ప్రభుత్వ హయాంలో 9 నెలల్లో రూ.22 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయనడం మోసమని ఆయన చెప్పారు.

Related posts