telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ సర్కారు నిర్మించిన ఇళ్లు పేదలకు పంచాలి: చంద్రబాబు

chandrababu speech on 12 hrs diksha

పేదల పట్ల నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు టీడీపీ ప్రభుత్వం నిర్మించిన గృహాలను పేదలకు పంచాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. పేదలకు ఏదైనా చేయాలంటే ప్రభుత్వం తరఫు నుంచి మంచి చేయాలని హితవు పలికారు. కానీ ఒక పేదకు మంచి చేయడానికి మరో పేద జీవనాధారం తీసేయడం సబబు కాదని అభిప్రాయపడ్డారు.

మీ ప్రచారం కోసం తాతల కాలం నాటి నుంచి ఎస్సీ కుటుంబాలకు ఆసరాగా ఉంటున్న భూములను లాక్కుని వాళ్లకు అన్యాయం చేస్తారా? అంటూ మండిపడ్డారు. ఇల్లు పీకి పందిరేసే ఇలాంటి వింత ఆలోచనలు, దుర్మార్గపు ఆలోచనలు మీకెక్కడి నుంచి వస్తున్నాయంటూ సీఎం జగన్ ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

Related posts