*హనుమకొండలో బీజేపీ బహిరంగ సభ
*సెప్టెంబర్ లో నాలుగో విడద ప్రజాసంగ్రామ యాత్ర
*హనుమకొండ బీజేపీ సభలో ప్రకటించిన బండి
*కేసీఆర్ కోసం జిల్లాకో జైలు రెడీ చేశాం
*కేసీఆర్ను, ఆయన కుటుంబాన్ని వదిలే ప్రసక్తే లేదు
బీజేపీ కార్యకర్తలకు జైళ్లు కొత్త కాదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ధర్మ రక్షకులు పీడీ యాక్ట్లకు భయపడరని అన్నారు. హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో బీజేపీ ప్రజాసంగ్రామ యాత్ర మూడో విడత ముగింపు సభలో మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. ‘జైలుకెళ్లి వచ్చా.. కేసీఆర్కు రూమ్ రెడీ చేసి వచ్చా’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు బండి సంజయ్.
ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతిసారీ అడ్డుకుంటోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని,బైంసాలో ఎంఐఎం కుట్రలను తట్టుకొని ధర్మం కోసం బీజేపీ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు బతికినన్నాళ్లు ధర్మం కోసమే బతుకుతారన్నారు కేసీఆర్ కోసం ప్రతి జిల్లాకో జైలు రూమ్ రెడీ చేశామన్నారు సంజయ్.
సీఎం కేసీఆర్, ఆయన కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. ఆంక్షల పేరుతో ప్రభుత్వం ప్రతీసారి అడ్డుకుంటోందన్నారు. తనను అరెస్ట్ చేసినా యాత్ర ఆగలేదన్నారు. యాత్ర పూర్తి చేసి చూపించామన్నారు. మూసీ ప్రక్షాళన ఏమైందని ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు.. ట్రాఫిక్ నిబంధనల పేరుతో బీజేపీ సభలను కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటోందని మండిపడ్డారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని, ఆ ఆరోపణలను పక్కదారి పట్టించడానికే తనను అరెస్ట్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. ఆ కుంభకోణంలో పాత్ర ఉందా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ దేవతలను అవమానించిన మునావర్కి 2 వేల మందితో భద్రత కల్పిస్తారా? అని టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బండి సంజయ్. లిక్కర్ స్కామ్ను పక్కదారి పట్టించడానికే మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టాలని చూశారని విమర్శించారు. బీజేపీని బదనాం చేయడానికి హైదరాబాద్లో అల్లర్లు సృష్టించాలని చూశారన్నారు. గుంట నక్కలన్నీ ఒక్కటయ్యాయని అన్నారు. బీజేపీ సింహంలా సింగిల్గా వస్తుందన్నారు.