తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఆదివారం నాడు ప్రారంభమైంది..ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుంది. గంట ముందే పరీక్షాకేంద్రానికి చేరుకోవాలని ముందే అధికారులు నిర్దేశించిన సంగతి తెలిసిందే.
రాష్ట్ర వ్యాప్తంగా 1601 పరీక్ష కేంద్రాలు
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్ష కోసం తెలంగాణ వ్యాప్తంగా 1,601 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని మరో 35 పట్టణాలు, నగరాల్లో పరీక్ష కేంద్రాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేసింది. ఖాళీగా ఉన్న మొత్తం 15,644 పోస్టులకు 9.54 లక్షల మంది దరఖాస్తులు చేశారు.
గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోగా, పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించారు. చేతులకు మెహిందీ, టాటూలు ఉండకూడదని నిబంధన విధించారు. మహిళా అభ్యర్థులు నగలు ధరించకూడదన్న నిబంధన కూడా ఉంది. ఆ నిబంధనల మేరకు పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అభ్యర్థులను లోపలికి పంపించారు. ఈ సారి 16,321 కానిస్టేబుల్ పోస్టుల కోసం ఏకంగా 6,61,196 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఇంత భారీఎత్తున కానిస్టేబుళ్ల నియామకాల కోసం పరీక్ష జరుగుతోంది.
కానిస్టేబుల్ ప్రాథమిక రాత పరీక్షలో కనీస అర్హత మార్కుల్ని ఈసారి కుదించారు. ఇప్పటివరకు జరిగిన పరీక్షల్లో ఎస్సీ/ఎస్టీలు 30శాతం, బీసీలు 35 శాతం, ఇతరులు 40 శాతం కనీస మార్కులు సాధిస్తేనే అర్హులుగా గుర్తించేవారు. ఈసారి సామాజికవర్గాలతో నిమిత్తం లేకుండా అందరికీ 30 శాతం కనీస మార్కులనే అర్హతగా పరిగణించనున్నారు. ఈ పరీక్షలో ఆబ్జెక్టివ్ టైప్లో 200 ప్రశ్నలు ఉండనున్నాయి. వీటిలో 60 మార్కులు వస్తే సరిపోతుంది.నెగెటివ్ మార్కులు ఉంటాయి. అయిదు తప్పు సమాధానాలకు ఒక మార్కు తగ్గిస్తారు. ఇక్కడ అర్హత సాధిస్తే తదుపరి శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరు కావొచ్చు. ఇదీ గట్టెక్కితే తుది రాతపరీక్ష ఉండనుంది. ఆ పరీక్షలో మాత్రం నెగెటివ్ మార్కులుండవు.
ఆయుష్మాన్ భారత్ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు…