telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

జానారెడ్డి పై ఎమ్మెల్యే సీతక్క ఆసక్తికర వ్యాఖ్యలు

seethakka mla

ప్రస్తుతం తెలంగాణ ప్రజల చూపు అంత నాగార్జున సాగర్‌ ఎన్నికల పైనే ఉంది. అయితే ఈ ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అన్ని పార్టీలు ప్రచారం జోరుగా చేస్తున్నాయి. పోటాపోటీ ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.  అయితే తాజాగా నల్గొండ జిల్లా పెద్దవూర మీడియా సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.  తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవిని త్యాగం చేసిన నాయకుడు జానారెడ్డి అని… తెలంగాణ కోసం ముందుండి పోరాడిన వ్యక్తి జానారెడ్డి అని ఆమె పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రజల ఆకాంక్షను గుర్తించిన కాంగ్రెస్‌… తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అలాంటి జానారెడ్డిని, కాంగ్రెస్‌ను ఓడించాలని సాగర్ నియోజకవర్గంలోని ప్రతి గల్లీలో టీఆరెస్ నేతలను, ప్రజాప్రతినిధులను దింపి ప్రచారం నిర్వహిస్తుందని ఫైర్‌ అయ్యారు.  జానారెడ్డి ఎమ్మెల్యే పదవికి అర్హుడు కాదా ? జనారెడ్డిని బాల్కా సుమన్ విమర్శించడం దారుణమని మండిపడ్డారు.  తెలంగాణ కోసం కొట్లాడినవారిని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో అర్ధం చేసుకోవాలని.. కోదండరాం లాంటి వాళ్ళను తాచుపాము, విషపాము అని అంటున్నారని మండిపడ్డారు సీతక్క. అయితే చూడాలి మరి ఇంకడా ప్రజలు ఎవరికీ ఓటు చేసి గెలిపిస్తారు అనేది.

Related posts