telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుంది: కన్నా

Kanna laxminarayana

గత ఐదేళ్లలో టీడీపీ ఉక్కు పరిశ్రమను రాజకీయంగా వాడుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నారాయణ ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ స్థాపనకు కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. టీడీపీ నిర్లక్ష్యం వల్లే ఉక్కు పరిశ్రమ కార్యరూపం దాల్చలేదని పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వం ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనకు సిద్ధమైతే మా వంతు సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వెనకబడిన ప్రాంతమైన రాయలసీమ అభివృద్ధి కోసం నాయకులతో చర్చించనున్నట్లు తెలిపారు. జిల్లాలో బీజేపీని బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామన్నారు. జమిలి ఎన్నికలు వచ్చినా రాకపోయినా రాష్ట్రంలో వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం బీజేపీనే అని పేర్కొన్నారు.

Related posts