telugu navyamedia
రాజకీయ వార్తలు

గవర్నర్ లేఖ పై సీఎం సుప్రీంకోర్టును ఆశ్రయించిన కుమారస్వామి

CM Kumaraswamy killing order

కర్నాటక రాజకీయ పరిణామాలు మలుపులు తిరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటల లోపు అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని కర్ణాటక గవర్నర్ వాజ్‌భాయ్ వాలా సీఎం కుమారస్వామికి లేఖ రాశాడు. అయితే గవర్నర్ లేఖ పై కుమారస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సభలో బలనిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ డెడ్ లైన్ విధించడం రాజ్యాంగం విరుద్ధమని తన పిటిషన్ లో పేర్కొన్నారు.

మరో వైపు విప్‌పై కూడ స్పష్టత ఇవ్వాలని కూడ కాంగ్రెస్ పార్టీ చీఫ్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న సుప్రీంకోర్టు ఉత్తర్వుల్లో విప్ పై స్పష్టత ఇవ్వాలని ఆ పిటిషన్ లో కోరారు. అసెంబ్లీకి రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేల హాజరుపై బలవంతం చేయలేమన్న న్యాయస్థానం ఆదేశాలపై స్పష్టత ఇవ్వాలని, విప్ జారీ చేయడం రాజకీయ పార్టీకి ఉన్న హక్కు అని, సుప్రీంకోర్టు తీర్పు10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందికి వస్తుందని ఆ పిటిషన్ లో తెలిపారు.

Related posts