telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఠాగూర్ నిర్ణయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం: జగ్గారెడ్డి

jaggareddy in pcc race in telangana

తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జీగా మాణికం ఠాగూర్ నిర్ణయాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పార్టీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మాణికం ఠాగూర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాల్లో జగ్గారెడ్డి చురుగ్గా పాల్గొంటున్నారు.

ఈ నేపథ్యంలో మాణికం ఠాగూర్ తనకు వార్నింగ్ ఇచ్చినట్టుగా దుష్ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి తెలిపారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజంలేదని స్పష్టం చేశారు.సోషల్ మీడియాలో ఈవిధంగా ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఇన్చార్జి ఠాగూర్ తో సమావేశం సంతృప్తికరంగా సాగిందని జగ్గారెడ్డి వెల్లడించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.

Related posts