నదీ జలాల విషయంలో ఏపీకి సీఎం కేసీఆర్ సహకరిస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. అందుకే పోతిరెడ్డిపాడుపై ముఖ్యమంత్రి కేసీఆర్ మౌనంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేంద్రానికి ఎందుకు లేఖ రాయలేదు? అని ప్రశ్నించారు.
సీఎం తీరుతో పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారతాయని బండి జోస్యం చెప్పారు. జగన్తో ఒప్పందంలో భాగంగానే అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయించారన్నారు. ఏపీ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు. ఆగస్టు 12లోపు సీఎం కేసీఆర్ అఫెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయించాలని బండి డిమాండ్ చేశారు.
సోము వీర్రాజు కామెంట్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదు…