ఏపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలపై దృష్టిసారించామని మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. కొవిడ్ ఆస్పత్రుల్లో భోజనం, పారిశుద్ధ్యం, మందుల సరఫరాపై ఫీడ్ బ్యాక్ తీసుకున్నామన్నారు.
ఆసుపత్రుల్లో మూడు రోజుల్లో అదనపు వైద్య సిబ్బంది నియామిస్తామని చెప్పారు. జూనియర్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.